దాసరి నారాయణరావు కి రాజ్యసభ ఘన నివాళి
- July 17, 2017
ఈ మధ్యన చనిపోయిన రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ కేంద్ర సహాయ మంత్రి దాసరి నారాయణరావు కి పార్లమెంటు ఘన నివాళి అర్పించింది. ఇవాళ మొదలైన సభ కాసేపు దాసరి గురించి మాట్లాడుకుంది. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సంతాప సందేశాన్ని వినిపించారు. పలు రంగాల్లో ఆయన చేసిన కృషిని కొనియాడారు.
సినిమా, పత్రికా రంగంలో ఎంతో మందికి ఉపాధిని చూపించారని, ఎన్నో పార్లమెంటరీ సంఘాల్లో సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఆయనకుందని అన్సారీ గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న టైం లో కూడా అనేకమందికి ఆయన సహాయం చేసారు అని గుర్తు చేసుకున్నారు అందరూ.
ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టైం లో సొంత ప్రాంతాలకే కాక ఏపీ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అని చెప్పుకొచ్చారు మరికొందరు. రెండు నిమషాలు సభ మౌనం పాటించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







