కేరళ లో దారుణం మతం మార్చుకోపోతే నరికేస్తామంటూ బెదిరింపులు

- July 22, 2017 , by Maagulf
కేరళ లో దారుణం మతం మార్చుకోపోతే నరికేస్తామంటూ బెదిరింపులు

మతం మార్చుకోకపోతే కాలు, చెయ్యి నరికేస్తామంటూ మలయాళీ రచయిత కేపీ రమనున్నీకి బెదిరింపు లేఖ వచ్చింది. మొదట తాను ఈ లేఖను పట్టించుకోలేదని అయితే సీనియర్ రచయితలు ముందు జాగ్రత్త చర్యగా పోలీసులకు కంప్లైంట్ చెయ్యమని సలహా ఇవ్వడంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.  2010లో కూడా ఇలాగే న్యూమన్ కాలేజీ ఫ్రొఫెసర్ జోసఫ్‌ని కూడా ప్రశ్నాపత్రంలో మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు రాశారంటూ కాలు, చెయ్యి నరికేశారు. ఇప్పుడు రమనున్నీకి రాసిన లేఖలో జోసఫ్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయనకు పట్టిన గతే మీకు కూడా పడుతుందని బెదిరిపు లేఖలు రాశారు. రమనున్నీ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కేరళకు చెందిన యువకులకు ఉగ్రవాద సంస్థ ఐఎస్‌తో సంబంధాలున్నాయంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఇలాంటి లేఖలు రావడం ఆందోళన కలిగిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com