కేరళ లో దారుణం మతం మార్చుకోపోతే నరికేస్తామంటూ బెదిరింపులు
- July 22, 2017
మతం మార్చుకోకపోతే కాలు, చెయ్యి నరికేస్తామంటూ మలయాళీ రచయిత కేపీ రమనున్నీకి బెదిరింపు లేఖ వచ్చింది. మొదట తాను ఈ లేఖను పట్టించుకోలేదని అయితే సీనియర్ రచయితలు ముందు జాగ్రత్త చర్యగా పోలీసులకు కంప్లైంట్ చెయ్యమని సలహా ఇవ్వడంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2010లో కూడా ఇలాగే న్యూమన్ కాలేజీ ఫ్రొఫెసర్ జోసఫ్ని కూడా ప్రశ్నాపత్రంలో మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు రాశారంటూ కాలు, చెయ్యి నరికేశారు. ఇప్పుడు రమనున్నీకి రాసిన లేఖలో జోసఫ్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయనకు పట్టిన గతే మీకు కూడా పడుతుందని బెదిరిపు లేఖలు రాశారు. రమనున్నీ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కేరళకు చెందిన యువకులకు ఉగ్రవాద సంస్థ ఐఎస్తో సంబంధాలున్నాయంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఇలాంటి లేఖలు రావడం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







