అమెరికా అధ్యక్షుని ఆదేశాలు ఉత్తర కొరియా ఎవ్వరు వెళ్ళవొద్దు
- July 22, 2017
ఉత్తర కొరియాలో అమెరికన్లకు రక్షణ లేదని, అక్కడ నివసిస్తున్న ప్రవాస అమెరికన్లంతా వెంటనే తిరిగి అమెరికా వెళ్లిపోవాలంటూ ఉత్తర కొరియాలోని అమెరికా దౌత్య కేంద్రం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనల మేరకే ఈ ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది.
అమెరికా దౌత్యాధికారి రే టెల్లార్సన్ పేరు మీద విడుదలైన ఈ ప్రకటనలో.. భవిష్యత్తులో కూడా అమెరికన్లు ఉత్తర కొరియా వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అక్కడ ఇటీవల ఓటో వాంబియార్ అనే అమెరికన్ పౌరుడి మరణం తనను కలచివేసిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దౌత్యాధికారి రే టెల్లార్సన్ ప్రకటనలో పేర్కొన్నారు.
జూలై 27 నుంచి సరిగ్గా 30 రోజుల్లోగా ఉత్తర కొరియాలో ఉండే అమెరికన్లంతా స్వదేశానికి రావాలని, లేకపోతే వారి పాస్పోర్టులను పునరుద్ధరించేది లేదని రే స్పష్టం చేశారు. అలాగే జూలై 27 తర్వాత ఉత్తర కొరియాకు అమెరికన్లు ఎవరూ వెళ్లరాదని, ఒకవేళ తమ హెచ్చరికలను కాదని వెళితే వారి రక్షణతో తమకు ఎలాంటి సంబంధం ఉండదని కూడా రే ఆ ప్రకటనలో వివరించారు.
దీనిపై ఉత్తర కొరియా విదేశాంగ శాఖ కూడా స్పందిస్తూ.. అమెరికాతో దౌత్య సంబంధాలను కొనసాగించే యోచనలో తాము కూడా లేమని, జూలై 27 కంటే ముందు కూడా వెళ్లిపోవాలనుకునే వారు వెళ్లిపోవచ్చని, ఇలాంటి ప్రకటనలకు బెదిరేది లేదని తెలిపింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









