పాలస్తీనాలో మళ్లీ కాల్పులు, ఆరుగురు మృతి
- July 22, 2017
పాలస్తీనాలో ఇజ్రాయిల్ సైనికుల ఆగడాలకు అమాయక పౌరులు బలైపోతు న్నారు. గతరెండు రోజులుగా వెస్ట్బ్యాంక్లో చోటుచేసుకుంటున్న హింసాయుత ఘటనల్లో ఆరుగురు చనిపోయారు. జెరూసలేం పాతనగరంలోని ప్రఖ్యాత ముస్లిం ప్రార్థనా మందిరం టెం పుల్ మౌంట్ వద్ద ఇజ్రాయిల్ పెద్ద ఎత్తున భద్రతా బలగాల్ని మోహరించింది. మెటల్ డిటెక్టర్లను ఏర్పాటుచేసి, జెరూసలేం గోడకు సమీపంలో ఇనుపకంచె వేసింది. ప్రార్థనా మందిరం వైపు పాలస్తీనా పౌరులెవర్నీ వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో భద్రతాబలగాలకు, పాలస్తీనా పౌరుల మధ్య తీవ్రఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మరికొద్ది గంటల్లోనే వారిపై భద్రతా బలగా లు కాల్పులు జరిపారు. టెంపుల్మౌంట్ వద్ద చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఇజ్రాయిల్ - పాలస్తీనా మధ్య మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆక్రమిత ప్రాంతంలో మెటల్ డిటెక్టర్లతో ప్రవేశ ద్వారాలను ఏర్పాటుచేయటంపై పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్తో ఉన్న సంబంధాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నామని ఆయన ప్రక టించారు. ప్రఖ్యాత మసీదు 'అల్ అక్సా' నుంచి ఇజ్రాయిల్ బలగాలు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









