సిట్ విచారణకు హాజరైన సినీ నటుడు హీరో రవితేజ
- July 28, 2017
ప్రముఖ హీరో రవితేజ శుక్రవారం సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న ఆయన ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి నాంపల్లిలోని అబ్కారీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే తన తరఫు న్యాయవాదుల సలహాలు తీసుకున్న రవితేజ సిట్ విచారణకు వచ్చారు.
రవితేజకు తానే స్వయంగా డ్రగ్స్ సరఫరా చేసినట్లు డ్రగ్స్ మాఫియా కేసులో నిందితుడు జీశాన్ వెల్లడించడంతో ఆ కోణంలో అధికారులు ఆరా తీయనున్నారు. అలాగే కెల్విన్, జీశాన్తో గల సంబంధాలపై ప్రశ్నించనున్నట్లు సమాచారం. మరోవైపు హీరో రవితేజను చూసేందుకు సిట్ కార్యాలయం వద్దకు భారీగా జనాలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరోలు తరుణ్, నవదీప్, సినీనటి చార్మీ, ముమైత్ ఖాన్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇక తన కుమారుడికి డ్రగ్స్ వాడే అలవాటే లేదని, ఆయన తల్లి రాజ్యలక్ష్మి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







