మోహన్బాబు కథానాయకుడిగా 'గాయత్రి' ప్రారంభం
- July 29, 2017
మో హన్బాబు కథానాయకుడిగా ఆయన స్వీయ నిర్మాణంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘గాయత్రి’. మదన్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి మోహన్బాబు మనవరాళ్లు అరియానా, వివియానా క్లాప్నిచ్చారు. వాళ్లతో కలిసి లక్ష్మి మంచు, వెరోనికా మంచు, నిర్మల మంచు, పరుచూరి గోపాలకృష్ణ, డైమండ్ రత్నబాబు, సుద్దాల అశోక్తేజ దర్శకుడికి స్క్రిప్ట్ని అందజేశారు. మంచు లక్ష్మి తనయ విద్యానిర్వాణ మంచు కెమెరా స్విచ్ఛాన్ చేసింది. దర్శకుడు మదన్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మోహన్బాబు కాస్త విరామం తర్వాత కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది.
ఒక విభిన్నమైన కథతో తెరకెక్కబోతోంది. త్వరలోనే సినిమాకి సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడిస్తామ’’ని తెలిపింది చిత్రబృందం. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి, కళ: చిన్నా, కూర్పు: శేఖర్, సంగీతం: తమన్.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







