మోహన్బాబు కథానాయకుడిగా 'గాయత్రి' ప్రారంభం
- July 29, 2017
మో హన్బాబు కథానాయకుడిగా ఆయన స్వీయ నిర్మాణంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘గాయత్రి’. మదన్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి మోహన్బాబు మనవరాళ్లు అరియానా, వివియానా క్లాప్నిచ్చారు. వాళ్లతో కలిసి లక్ష్మి మంచు, వెరోనికా మంచు, నిర్మల మంచు, పరుచూరి గోపాలకృష్ణ, డైమండ్ రత్నబాబు, సుద్దాల అశోక్తేజ దర్శకుడికి స్క్రిప్ట్ని అందజేశారు. మంచు లక్ష్మి తనయ విద్యానిర్వాణ మంచు కెమెరా స్విచ్ఛాన్ చేసింది. దర్శకుడు మదన్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మోహన్బాబు కాస్త విరామం తర్వాత కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది.
ఒక విభిన్నమైన కథతో తెరకెక్కబోతోంది. త్వరలోనే సినిమాకి సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడిస్తామ’’ని తెలిపింది చిత్రబృందం. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి, కళ: చిన్నా, కూర్పు: శేఖర్, సంగీతం: తమన్.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









