మోహన్బాబు కథానాయకుడిగా 'గాయత్రి' ప్రారంభం
- July 29, 2017
మో హన్బాబు కథానాయకుడిగా ఆయన స్వీయ నిర్మాణంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘గాయత్రి’. మదన్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి మోహన్బాబు మనవరాళ్లు అరియానా, వివియానా క్లాప్నిచ్చారు. వాళ్లతో కలిసి లక్ష్మి మంచు, వెరోనికా మంచు, నిర్మల మంచు, పరుచూరి గోపాలకృష్ణ, డైమండ్ రత్నబాబు, సుద్దాల అశోక్తేజ దర్శకుడికి స్క్రిప్ట్ని అందజేశారు. మంచు లక్ష్మి తనయ విద్యానిర్వాణ మంచు కెమెరా స్విచ్ఛాన్ చేసింది. దర్శకుడు మదన్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మోహన్బాబు కాస్త విరామం తర్వాత కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది.
ఒక విభిన్నమైన కథతో తెరకెక్కబోతోంది. త్వరలోనే సినిమాకి సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడిస్తామ’’ని తెలిపింది చిత్రబృందం. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి, కళ: చిన్నా, కూర్పు: శేఖర్, సంగీతం: తమన్.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









