మోహన్బాబు కథానాయకుడిగా 'గాయత్రి' ప్రారంభం
- July 29, 2017
మో హన్బాబు కథానాయకుడిగా ఆయన స్వీయ నిర్మాణంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘గాయత్రి’. మదన్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి మోహన్బాబు మనవరాళ్లు అరియానా, వివియానా క్లాప్నిచ్చారు. వాళ్లతో కలిసి లక్ష్మి మంచు, వెరోనికా మంచు, నిర్మల మంచు, పరుచూరి గోపాలకృష్ణ, డైమండ్ రత్నబాబు, సుద్దాల అశోక్తేజ దర్శకుడికి స్క్రిప్ట్ని అందజేశారు. మంచు లక్ష్మి తనయ విద్యానిర్వాణ మంచు కెమెరా స్విచ్ఛాన్ చేసింది. దర్శకుడు మదన్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మోహన్బాబు కాస్త విరామం తర్వాత కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది.
ఒక విభిన్నమైన కథతో తెరకెక్కబోతోంది. త్వరలోనే సినిమాకి సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడిస్తామ’’ని తెలిపింది చిత్రబృందం. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి, కళ: చిన్నా, కూర్పు: శేఖర్, సంగీతం: తమన్.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







