నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మ్యూజియంలో విలువైన వస్తువు చోరీ
- July 30, 2017నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ఓ విలువైన వస్తువు చోరీకి గురైంది. లూనార్ స్సేస్ మాడ్యూల్ బంగారు ప్రతిమను మ్యూజియం నుంచి దుండగులు ఎత్తుకెళ్లారు.
వాయువ్య ఒహైయోలోని వపకొనేట ప్రాంతంలో ఈ మ్యూజియం ఉంది. శుక్రవారం అర్ధరాత్రి మ్యూజియంలో అలారం మోగడంతో వెంటనే స్థానిక పోలీసులు, సిబ్బంది వచ్చి పరిశీలించారు. లూనార్ స్సేస్ మాడ్యూల్ బంగారు ప్రతిమ చోరీకి గురైందని గుర్తించారు. పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆర్మ్స్ట్రాంగ్తోపాటు మరో ఇద్దరు వ్యోమగాములకు గతంలో ఈ బంగారు ప్రతిమను బహుమతిగా అందించారు. 1969 జులైలో చంద్రునిపై కాలుమోపిన తొలి వ్యక్తిగా ఆర్మ్స్ట్రాంగ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 82 ఏళ్ల వయసులో ఆర్మ్స్ట్రాంగ్ కన్నుమూశారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్