నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మ్యూజియంలో విలువైన వస్తువు చోరీ
- July 30, 2017
నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ఓ విలువైన వస్తువు చోరీకి గురైంది. లూనార్ స్సేస్ మాడ్యూల్ బంగారు ప్రతిమను మ్యూజియం నుంచి దుండగులు ఎత్తుకెళ్లారు.
వాయువ్య ఒహైయోలోని వపకొనేట ప్రాంతంలో ఈ మ్యూజియం ఉంది. శుక్రవారం అర్ధరాత్రి మ్యూజియంలో అలారం మోగడంతో వెంటనే స్థానిక పోలీసులు, సిబ్బంది వచ్చి పరిశీలించారు. లూనార్ స్సేస్ మాడ్యూల్ బంగారు ప్రతిమ చోరీకి గురైందని గుర్తించారు. పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆర్మ్స్ట్రాంగ్తోపాటు మరో ఇద్దరు వ్యోమగాములకు గతంలో ఈ బంగారు ప్రతిమను బహుమతిగా అందించారు. 1969 జులైలో చంద్రునిపై కాలుమోపిన తొలి వ్యక్తిగా ఆర్మ్స్ట్రాంగ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 82 ఏళ్ల వయసులో ఆర్మ్స్ట్రాంగ్ కన్నుమూశారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







