నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మ్యూజియంలో విలువైన వస్తువు చోరీ
- July 30, 2017
నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ఓ విలువైన వస్తువు చోరీకి గురైంది. లూనార్ స్సేస్ మాడ్యూల్ బంగారు ప్రతిమను మ్యూజియం నుంచి దుండగులు ఎత్తుకెళ్లారు.
వాయువ్య ఒహైయోలోని వపకొనేట ప్రాంతంలో ఈ మ్యూజియం ఉంది. శుక్రవారం అర్ధరాత్రి మ్యూజియంలో అలారం మోగడంతో వెంటనే స్థానిక పోలీసులు, సిబ్బంది వచ్చి పరిశీలించారు. లూనార్ స్సేస్ మాడ్యూల్ బంగారు ప్రతిమ చోరీకి గురైందని గుర్తించారు. పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆర్మ్స్ట్రాంగ్తోపాటు మరో ఇద్దరు వ్యోమగాములకు గతంలో ఈ బంగారు ప్రతిమను బహుమతిగా అందించారు. 1969 జులైలో చంద్రునిపై కాలుమోపిన తొలి వ్యక్తిగా ఆర్మ్స్ట్రాంగ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 82 ఏళ్ల వయసులో ఆర్మ్స్ట్రాంగ్ కన్నుమూశారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









