ఉపాధ్యాయులు తమ జీతాల కోసం ఇక వేచి ఉండనవసరం లేదు

- July 31, 2017 , by Maagulf
ఉపాధ్యాయులు తమ జీతాల కోసం ఇక వేచి ఉండనవసరం లేదు

మనామ: ఎటువంటి నోటీసు లేకుండా అల్ మజ్ద్ ప్రైవేట్ పాఠశాల మూసివేసిన తర్వాత ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పెండింగ్ జీతాలను చెల్లించేందుకు  పాఠశాల మేనేజ్మెంట్ నిరాకరించినట్లు ఆరోపించారు. ఉపాధ్యాయుల అభిప్రాయం ప్రకారం, పాఠశాల మంత్రిత్వశాఖ ప్రమాణాల ప్రకారం ఆ పాఠశాల పనిచేయడం లేదని  విద్య మంత్రిత్వశాఖ ఒక నోటీసును ఆ పాఠశాలకు అందించింది, దీని ఫలితంగా ఉపాధ్యాయ సిబ్బందిని  తొలగించడం జరిగింది. "విద్య మంత్రిత్వశాఖ ఒక నోటీసును పంపినప్పుడు  పాఠశాల మేనేజ్మెంట్  2017జూన్ చివరి వారంలో అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఉద్యోగాలను రద్దు చేసింది. 30 మంది కంటే ఎక్కువ ఉపాధ్యాయులను తొలగించారు. పాఠశాల రద్దు చేయబదిననాటికె మాకు ఆప్పటికీ మా బకాయి ( పెండింగ్ ) జీతాలు కోసం ఎదురుచూస్తున్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు. వారు ఈ సందర్భంగా " మా గల్ఫ్ న్యూస్ డాట్ కామ్ " మాట్లాడుతూ, "మేము ఈ విషయమకీ మానవ వనరుల శాఖని పలుమార్లు పిలిచి తమ సమస్యను పరిష్కరించాలని పిలిచాము మరియు పాఠశాల యాజమాన్యం చాలాసార్లు సంప్రదించాము. వారు మాతో  స్తబ్దుగా ఉండాలని కోరుతున్నారు. ఒక నెల కన్నా ఎక్కువ  ఉన్న ఇంకా పెండింగ్ వేతనాలు మాకు ఇంకా చెల్లించలేదని ఒక ఉద్యోగి చెప్పాడు."మేము విద్య మంత్రిత్వశాఖ దృష్టికి  తీసుకువెళ్ళేమని అయితే వారు  ఈ విషయంలో మాకు సహాయం చేయలేమని చెప్పారు, ఎందుకంటే మేము చట్టబద్ధంగా పాఠశాల వర్క్ పర్మిట్  వీసా పరిధిలో ఉండకపోవడమే నని మరొక  ఉపాధ్యాయుడు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com