దోసకాయ మటన్ కర్రీ
- August 01, 2017
కావాల్సిన పదార్థాలు
దోసకాయ - ఒకటి (సగం పండినది), టొమాటో - ఒకటి, మటన్ - పావుకేజీ, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూన్, నూనె - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, కారం ఒక టీస్పూన్, నీళ్లు - అరకప్పు, పసుపు - కొద్దిగా, కొత్తిమీర - ఒకకట్ట.
ఎలా చేయాలి?
దోసకాయ పొట్టు తీసి రెండు ముక్కలుగా కట్ చేసుకుని విత్తనాలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్పై బాండీ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి మరి కాసేపు వేయించాలి. మటన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేయాలి. దాదాపు పది నిమిషాలు చిన్న మంటపై వేయించాలి. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. ఐదు నిమిషాల పాటు చిన్న మంటపై వేయించాలి. టొమాటో ముక్కలు వేసి మరి కాసేపు వేయించాలి. కారం, ఉప్పు వేసి తిప్పుతూ చిన్న మంటపై కాసేపు వేయించి అర కప్పు నీళ్లు పోయాలి. చిన్న మంటపై పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గ్రేవీ దగ్గర అయ్యే వరకు ఉడికించుకుని కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









