అమరావతి శిలాఫలకానికెక్కిన ప్రముఖులు వీరే

- October 21, 2015 , by Maagulf
అమరావతి శిలాఫలకానికెక్కిన ప్రముఖులు వీరే

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై 16 మంది ప్రముఖుల పేర్లను చేర్చారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, పంజాబ్ సీఎం ప్రకాష్‌సింగ్ బాదల్ పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. వీరి తర్వాత తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య, సుప్రీంకోర్టు జడ్జి ఎన్‌వీ రమణ, హైకోర్టు తాత్కాలిక సీజే దిలీప్ భోసలే పేర్లు ఉన్నాయి. వీరి పేర్లతో పాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, దత్తాత్రేయల పేర్లు ఉన్నాయి. అమరావతి నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ తయారు చేసిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో పాటు అమరావతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్న జపాన్ మంత్రి ఇసుకే టకాచీ పేరు కూడా శంకుస్థాపన శిలాఫలకంపై చేర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com