అమరావతి శంకుస్థాపనకు తనవంతు సహాయం అందించిన సూపర్ స్టార్..!!

- October 21, 2015 , by Maagulf
అమరావతి శంకుస్థాపనకు తనవంతు సహాయం అందించిన సూపర్ స్టార్..!!

రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి ప్రముఖ నటుడు రజినీకాంత్‌ తన వంతు తోడ్పాటుగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన రెండు మినీ బస్సులను విజయవాడకు పంపించారు. క్యారావ్యాన్‌లుగా పిలిచే ఈ వాహనాల్లో విశ్రాంతి గది, టీవీ, స్నానాల గది, సమావేశ మందిరం లాంటి పలు సౌకర్యాలు ఉన్నాయి. కార్యక్రమానికి వచ్చే విదేశీ ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి వీటిని వినియోగించే అవకాశముంది. వీటిని గన్నవరం విమానాశ్రయం నుంచి సభా వేదిక వద్దకు అతిథులను తీసుకెళ్లేందుకు వాడాలా, లేక సభా వేదిక వద్ద ఉంచాలా అన్నది అధికారులు ఆలోచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com