ఎంపీ కల్వకుంట కవిత.. చిరుకి అభిమానిగా మారిన వేళ
- August 05, 2017
ఓ అభిమానిగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి సెల్ఫీ తీసుకున్నందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట కవిత ఆనందం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎంపీలు చిరంజీవి, కవిత పార్లమెంటు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ చిరుతో కలిసి దిగిన సెల్ఫీని కవిత ట్విటర్లో పోస్ట్ చేశారు. పార్లమెంటులో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవితో ఫ్యాన్ మూమెంట్ అని ట్వీట్ చేశారు. చిరు ఈ ఫొటోలో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పాత్ర కోసం సిద్ధమైన లుక్లో కనిపించారు. 'మహవీర్' అనే టైటిల్ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









