షర్క్ లో మసీదుపై దాడి చేసిన నివేదికలు నిరాధారమైనవి, మోయి స్పష్టం

- August 05, 2017 , by Maagulf
షర్క్ లో  మసీదుపై దాడి చేసిన నివేదికలు నిరాధారమైనవి, మోయి  స్పష్టం

కువైట్ : షర్క్ జిల్లాలోని ఒక మసీదుపై ఒక ప్రత్యేక దళాల దాడి గురించి మరియు కువైట్ నగరంలో ఒక వ్యక్తిని నిర్బంధించడం గురించి సోషల్ మీడియాలో ప్రచురించిన ఒక పోస్ట్  "పూర్తిగా అబద్ధము"  అని ఆ నివేదికలలో వాస్తవం లేదని  ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. మంత్రిత్వ శాఖ యొక్క పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ శుక్రవారం ఈ మేరకు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. మసీదులో ఆరాధకుల భద్రతకు హామీ ఇచ్చే చర్యలలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యలను పరిశీలించడానికి అక్కడ ఉన్న అధికారితో సమన్వయం పొందిన తరువాత ఒక భద్రతా బృందం మసీదును సందర్శించిందని వివరించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సౌకర్యాలు, ఆరాధనా స్థలాల భద్రతను కొనసాగించడానికి ముందు జాగ్రత్త చర్యలు, భద్రతా సందర్శనలు రెండూ కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. మంత్రిత్వ శాఖ కార్యదర్శి మహమూద్ అల్-దోషరి ఇదే విధమైన తరచూ  తనిఖీ సందర్శనలను జరిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ కల్పిత వార్తలు మరియు పుకార్లను ప్రజలు విశ్వసించరాదని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఏ ప్రశ్నలకైనా  పారదర్శక పద్ధతిలో స్పందించదానికి  మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com