వలసదారుల వర్క్‌ పర్మిట్‌ ఫీజు పెంపు లేదు: సౌదీ

- August 07, 2017 , by Maagulf
వలసదారుల వర్క్‌ పర్మిట్‌ ఫీజు పెంపు లేదు: సౌదీ

వలసదారుల వర్క్‌ పర్మిట్‌ ఫీజు పెంపు లేదని మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ స్పష్టత ఇచ్చింది. మినిస్ట్రీ ఏ డెసిషన్‌ తీసుకున్నా, అధికారికంగా ప్రకటిస్తందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నితాకత్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా సౌదీజేషన్‌ పర్సంటేజెస్‌ని సెప్టెంబర్‌ 3 నుంచి అమలు చేయనుంది. 2012 నుంచి లేబర్‌ మినిస్ట్రీ, వలసదారుల వద్ద నెలకు 200 దిర్హామ్‌లు ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. ఇంకో వైపున మినిస్ట్రీ 52,898 లేబర్‌ ఉల్లంఘనల్ని కింగ్‌డమ్‌లోని పలు ప్రాంతాల్లో గుర్తించినట్లు సౌదీ గెజిట్‌ రిపోర్ట్స్‌ వెల్లడిస్తున్నాయి. 2016 అక్టోబర్‌ 2 నుండి 23 జులై వరకు 141,827 విజిట్స్‌ని అధికారులు నిర్వహించారు. ఈ ఇన్‌స్పెక్షన్‌ క్యాంపెయిన్స్‌ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయనీ, ఉల్లంఘనులపై కఠిన చర్యలుంటాయని మినిస్ట్రీ అధికార ప్రతినిథి ఖాలెద్‌ అబాల్‌ఖైల్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com