ఖతార్ సంక్షోభంపై కువైట్ కొత్త ప్రతిపాదన
- August 08, 2017
ఖతార్ సంక్షోభం నేపథ్యంలో కువైట్ కొత్త ప్రతిపాదనలో ముందుకొచ్చింది. చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్న కువైట్, ఖతార్పై బ్యాన్ విధించిన వివిధ దేశాలతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఖతార్ సంక్షోభం ఎక్కువ కాలం ఉండటం గల్ఫ్ ప్రాంతానికి మంచిది కాదని కువైట్ భావిస్తోంది. కువైట్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు ఫారిన్ మినిస్టర్ షేక్ సబా అల్ ఖాలిద్ అల్ హమాద్ అల్ సబా మరియు స్టేట్ మినిస్టర్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ అలాగే యాక్టింగ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ అల్ అబ్దుల్లా సోమవారం సౌదీ అరేబియా, ఈజిప్ట్లకు చెందిన ప్రముఖులతో చర్చించరు. సౌదీ అరేబియాలో జరిగిన చర్చల్లో గల్ఫ్ ప్రాంతంలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇంకో వైపున జూన్ నుంచి ఖతార్ సంక్షోభ నివారణకు జరుగుతున్న ప్రయత్నాలేవీ సత్ఫలితాలు ఇవ్వడంలేదు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







