కేరళీయుల కోసం 36 బడ్జెట్ విమాన సర్వీసులు
- August 09, 2017
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 40 అదనపు విమాన సర్వీసుల్ని షార్జా - ఇండియా మధ్య నడుపుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా కేరళీకులయకు ఈద్, ఓనమ్ సందర్భంగా సెలవుల అనంతరం రిటర్న్ జర్నీ కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విమానాల్లో ఒక్కోదాంట్లో 186 మంది ప్రయాణీకులుంటారు. ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఈ తక్కువ ఛార్జీల విమానాలు సేవలందిస్తాయని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వర్గాలు వెల్లడించాయి. కేరళలోని తిరువనంతపురం, కోచి, కోజికోడ్తోపాటుగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి సేవలందిస్తాయి. కేరళ నుంచి ఎక్కువగా యూఏఈకి వలస వెళ్ళినవారు ఉంటారనీ, ఈ కారణంగా ప్రత్యేక విమాన సర్వీసుల్ని కేరళకు నడుపుతామని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అధికార ప్రతినిథి వెల్లడించారు. యూఏఈలో మొత్తంగా 1 మిలియన్ కేరళీయులు ఉంటారనేది ఓ అంచనా. వారానికి 150 విమానాలు యూఏఈ నుంచి ఇండియాకి నడుపుతుంటారు. వీరిలో మెజార్టీ కేరళ సెక్టార్లోనే ప్రయాణిస్తుంటారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







