ఇండియా ఎడ్యుకేషన్ ఫెస్టివల్లో నహ్యాన్ ప్రసంగం
- August 09, 2017
ప్రతి చిన్నారికీ విద్య ఓ హక్కు అని, సమాజంలోని అన్ని అసమానతలకీ విద్యతో చెక్ పెట్టవచ్చునని మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ నాలెడ్జ్ డెవలప్మెంట్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ చెప్పారు. యూఏఈకి చెందిన జెమ్స్ ఎడ్యుకేషన్, అలాగే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా జైపూర్లో నిర్వహించిన ఎడ్యుకేషనల్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో నహ్యాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఫెస్టివల్కి గౌరవ అతిథిగా షేక్ నహ్యాన్ వ్యవహరించారు. ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాల్లో తల్లిదండ్రులు భాగస్వాములు కావాల్సి ఉందనీ, అప్పుడే విద్య పట్ల సమాజం మరింత మెరుగైన విధంగా ఆలోచించడం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ప్రతి చిన్నారికీ విద్య ప్రాథమిక హక్కుగా లభించేందుకోసం విద్యా సంస్థలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనీ, పిల్లలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యను అందించడం, అలాగే పాఠాలు చెప్పడంలో సరికొత్త నైపుణ్యాల్ని అందిపుచ్చుకోవడం అవసరమని షేక్ నహ్యాన్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







