6 నెలల్లో 12 మిలియన్ ప్రయాణీకులకు కస్టమ్స్ క్లియరెన్స్
- August 10, 2017
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆరు నెలల్లోనే మొత్తం 12 మిలియన్ మంది ప్రయాణీకుల్ని కస్టమ్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇది కాకుండా 18 మిలియన్ లగేజ్ ఐటమ్స్ని 39,000 విమానాల ద్వారా ఈ ఆరునెలల్లోనే ప్రాసెస్ చేసినట్లు తెలియవస్తోంది. ఈ కాలంలో 360 సీజ్లు, 6,500 కస్టమ్స్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. దుబాయ్ కస్టమ్స్ ప్యాసింజర్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఇబ్రహీమ్ అల్ కమాలి మాట్లాడుతూ, దుబాయ్ ఎయిర్ పోర్ట్ల ద్వారా ప్రయాణం ప్రయాణీకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుందనీ, ఎలక్ట్రానిక్ గేట్స్ వంటి విధానాలతో ప్రయాణీకుల ఇబ్బందులు తగ్గాయని చెప్పారు. స్మార్ట్ ఇన్స్పెక్షన్ విధానం ద్వారా ఇన్స్పెక్షన్ సమయం 50 నుంచి 70 శాతం వరకు తగ్గిందని అన్నారాయన. యాత్రీకులకోసం మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు తెలియజేశారు అల్ కమాలి.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









