6 నెలల్లో 12 మిలియన్ ప్రయాణీకులకు కస్టమ్స్ క్లియరెన్స్
- August 10, 2017
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆరు నెలల్లోనే మొత్తం 12 మిలియన్ మంది ప్రయాణీకుల్ని కస్టమ్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇది కాకుండా 18 మిలియన్ లగేజ్ ఐటమ్స్ని 39,000 విమానాల ద్వారా ఈ ఆరునెలల్లోనే ప్రాసెస్ చేసినట్లు తెలియవస్తోంది. ఈ కాలంలో 360 సీజ్లు, 6,500 కస్టమ్స్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. దుబాయ్ కస్టమ్స్ ప్యాసింజర్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఇబ్రహీమ్ అల్ కమాలి మాట్లాడుతూ, దుబాయ్ ఎయిర్ పోర్ట్ల ద్వారా ప్రయాణం ప్రయాణీకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుందనీ, ఎలక్ట్రానిక్ గేట్స్ వంటి విధానాలతో ప్రయాణీకుల ఇబ్బందులు తగ్గాయని చెప్పారు. స్మార్ట్ ఇన్స్పెక్షన్ విధానం ద్వారా ఇన్స్పెక్షన్ సమయం 50 నుంచి 70 శాతం వరకు తగ్గిందని అన్నారాయన. యాత్రీకులకోసం మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు తెలియజేశారు అల్ కమాలి.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







