6 నెలల్లో 12 మిలియన్ ప్రయాణీకులకు కస్టమ్స్ క్లియరెన్స్
- August 10, 2017
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆరు నెలల్లోనే మొత్తం 12 మిలియన్ మంది ప్రయాణీకుల్ని కస్టమ్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇది కాకుండా 18 మిలియన్ లగేజ్ ఐటమ్స్ని 39,000 విమానాల ద్వారా ఈ ఆరునెలల్లోనే ప్రాసెస్ చేసినట్లు తెలియవస్తోంది. ఈ కాలంలో 360 సీజ్లు, 6,500 కస్టమ్స్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. దుబాయ్ కస్టమ్స్ ప్యాసింజర్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఇబ్రహీమ్ అల్ కమాలి మాట్లాడుతూ, దుబాయ్ ఎయిర్ పోర్ట్ల ద్వారా ప్రయాణం ప్రయాణీకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుందనీ, ఎలక్ట్రానిక్ గేట్స్ వంటి విధానాలతో ప్రయాణీకుల ఇబ్బందులు తగ్గాయని చెప్పారు. స్మార్ట్ ఇన్స్పెక్షన్ విధానం ద్వారా ఇన్స్పెక్షన్ సమయం 50 నుంచి 70 శాతం వరకు తగ్గిందని అన్నారాయన. యాత్రీకులకోసం మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు తెలియజేశారు అల్ కమాలి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









