డిస్ట్రెస్లో ఉన్న మెయిడ్ని రక్షించిన స్థానిక అధికారులు
- August 10, 2017
లోకల్ అథారిటీస్, డిస్ట్రెస్తో బాధపడుతున్న ఓ మహిళను రక్షించినట్లు అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ వర్గాలు వెల్లడించాయి. హౌస్మెయిడ్గా పనిచేస్తోన్న ఓ మహిళ, తన యజమాని నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారనీ, ఈ విషయమై ఎంబసీ వద్ద ఫిర్యాదు చేసేందుకు రాగా చిన్నపాటి మిస్ కమ్యూనికేషన్తో ఆమె కాంటాక్ట్ తప్పిపోవడం జరిగిందని, ఈ నేపథ్యంలో ఆమెను లోకల్ అథారిటీస్ రక్షించాయని ఫస్ట్ సెక్రెటరీ, కౌన్సిలర్ ఫర్ కమ్యూనిటీ ఎఫైర్స్ - ఎంబసీ దినేష్కుమార్ చెప్పారు. యజమానితో తలెత్తిన సమస్య పట్ల చర్చలతోనే పరిష్కారం వెతకాల్సిందిగా ఎంబసీ అధికారులు ఆమెకి సూచించారనీ, అలా చెప్పడానికి కారణం ఆమె కేవలం రెండు నెలల క్రితమే ఆ పనిలో చేరారని కుమార్ వివరించారు. ఎంబసీ అధికారులు ఆమెకు ఓ ఫోన్ నెంబర్ ఇవ్వగా, ఆమె ఫోన్ చేసినప్పటికీ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఎంబసీ అధికారులు సరైన సమయంలో స్పందించలేదని కుమార్ చెప్పారు. బాధితురాలికి సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామనీ, ఆమె కోరితే స్వదేశానికి పంపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని కుమార్ తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









