కతర్ లో భారతీయులకు వీసా-ఫ్రీ 60 రోజులు
- August 11, 2017
సౌదీ నేతృత్వంలో అరబ్ దేశాల నిషేధంతో సంక్షోభంలోకి వెళ్లిన ఖతర్.. విదేశీ సందర్శకులకు గుడ్న్యూస్ అందించిన సంగతి తెలిసిందే. తమ దేశంలో ప్రయాణించడానికి 80 దేశాల ప్రజలు వీసా దరఖాస్తు చేసుకోవాల్సినవసరం లేదని పేర్కొంది. అయితే ఏ దేశం ప్రజలకు ఎన్ని రోజుల వరకు వీసా మినహాయింపు ఉంటుందో క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఆ క్లారిటీ కూడా వచ్చేసింది. భారతీయులతో పాటు 46 దేశస్తుల ప్రజలు వీసా అవసరం లేకుండా 60 రోజుల పాటు ఖతర్లో ఉండొచ్చని తెలిసింది. బుధవారం ప్రకటించిన ఈ పాలసీపై 80 దేశాలను రెండు పార్ట్లుగా విభజించింది. ఈ కొత్త వీసా-ఫ్రీ స్కీమ్ కింద వీసా అవసరం లేకుండా ఉండే గడువును 60 రోజులు, 90 రోజులుగా వర్గీకరించింది.
''భారత్తో పాటు 47 దేశాల ప్రజలు వీసా ఏర్పాట్లు చేసుకోకుండా ఖతార్లో ఉండేందుకు వీసా మినహాయింపును ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. ఈ మినహాయింపు జారీ తేదీ నుంచి 30 రోజులు వాలిడిటీలో ఉంటుంది. ఈ మినహాయింపును మరో 30 రోజులు పొడిగిస్తాం'' అని ఖతర్ ఎయిర్వేస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, రష్యా, చైనా దేశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. మరో 33 దేశాలకు వీసా మినహాయింపును జారీ తేదీ నుంచి 180 రోజులు అందిస్తామని, సింగిల్ లేదా మల్టిఫుల్ ట్రిపులలో వీరు 90 రోజుల వరకు ఖతర్లో ఉండొచ్చని పేర్కొంది. ఈ దేశాల్లో ముఖ్యంగా ఫ్రాన్స్ లాంటి యూరోపియన్ దేశాలు, టర్కీ ఉన్నట్టు పేర్కొంది.
ఖతర్లో ప్రవేశించే సమయంలో ఎలాంటి రుసుము తీసుకోకుండానే మల్టీ ఎంట్రీ వేవియర్ ఇవ్వనున్నట్టు ఖతర్ అధికారులు పేర్కొన్నారు. దీనికి గానూ ఆరునెలలకు తక్కువగా లేకుండా వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్టుతో పాటూ ప్రయాణానికి సంబంధించి టికెట్ను చూపించాల్సి ఉంటుంది. 80 దేశాలకు చెందిన పౌరులు ఫ్రీ వీసా వేవియర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని ఖతార్ టూరిజం అథారిటీ చైర్మన్ హసన్ అల్ ఇబ్రహిం తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







