ఏపీఆర్టీసీలో వయో వృద్ధులకు 25 శాతం రాయితీ
- August 11, 2017
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో వయో వృద్ధులకు ప్రయాణ ఛార్జీలో 25శాతం రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏసీ బస్సుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టంగా పేర్కొంది. కొత్త బస్సుల కొనుగోలు కోసం ఆర్టీసీకి ప్రభుత్వం రూ.117.90 కోట్లు విడుదల చేసింది.
ఉద్యోగులకు డీఏ పెంపు ఉత్తర్వులు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం పెంచుతూ ఏపీ సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. జులై ఒకటి నుంచీ బేసిక్ పేలో 18.34శాతం ఉన్న డీఏను 22.08 శాతానికి పెంచుతూ ఆదేశాలిచ్చింది. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏ పెంపు అంశంపై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జులై 2016 నుంచి 31 ఆగస్టు 2017 వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో జమచేయాలని ఆదేశించింది. అలాగే కంట్రిబ్యూటరీ పింఛను పథకం కింద నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బకాయిల్లో పది శాతం వారి ప్రాన్ ఖాతాలో జమచేయాలని, మిగిలిన 90శాతం అక్టోబరు 2017 నెలలో వారికి నగదు రూపంలో చెల్లించాలని ఖజానా శాఖను ఆదేశించింది.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







