ఏపీఆర్టీసీలో వయో వృద్ధులకు 25 శాతం రాయితీ
- August 11, 2017
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో వయో వృద్ధులకు ప్రయాణ ఛార్జీలో 25శాతం రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏసీ బస్సుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టంగా పేర్కొంది. కొత్త బస్సుల కొనుగోలు కోసం ఆర్టీసీకి ప్రభుత్వం రూ.117.90 కోట్లు విడుదల చేసింది.
ఉద్యోగులకు డీఏ పెంపు ఉత్తర్వులు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం పెంచుతూ ఏపీ సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. జులై ఒకటి నుంచీ బేసిక్ పేలో 18.34శాతం ఉన్న డీఏను 22.08 శాతానికి పెంచుతూ ఆదేశాలిచ్చింది. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏ పెంపు అంశంపై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జులై 2016 నుంచి 31 ఆగస్టు 2017 వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో జమచేయాలని ఆదేశించింది. అలాగే కంట్రిబ్యూటరీ పింఛను పథకం కింద నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బకాయిల్లో పది శాతం వారి ప్రాన్ ఖాతాలో జమచేయాలని, మిగిలిన 90శాతం అక్టోబరు 2017 నెలలో వారికి నగదు రూపంలో చెల్లించాలని ఖజానా శాఖను ఆదేశించింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









