నాగార్జున చిత్రం వచ్చే ఏడాది మొదటి వారం లో రిలీజ్
- October 22, 2015
అక్కినేని నాగార్జున , తమిళ్ హీరో కాంబినేషన్ లో ఒకేసారి తెలుగు - తమిళ భాషల్లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం 'ఊపిరి'. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో రాబోతున్న ఈ చిత్రం తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇంకా ఒక నెల రోజుల షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. ప్రస్తుతం నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా' షూటింగ్ లో బిజీగా ఉండడం వలన ఊపిరి సినిమాకి బ్రేక్ ఇచ్చారు. తాజా సమాచారం ఈ నెల చివరిన షూటింగ్ ని మొదలు పెట్టి నవంబర్ చివరికల్లా పూర్తి చేయనున్నారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి మరో నెల రోజుల సమయం పడుతుంది. ముందుగా ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్న షూటింగ్ ఆలస్యం కావడం వల్ల వచ్చే ఏడాది మొదటి వారం లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ చిత్ర రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటన చేయనున్నారని వార్త. నాగార్జున ఈ సినిమాలో ఎక్కువ భాగం వీల్ చెయిర్ లోకనిపిస్తాడు. ఈ సినిమాలో వీరితో పాటు ఓ ముఖ్య పాత్రలో అనుష్క - అడవి శేష్ జంటగా కనిపించనున్నారు. విపి బ్యానర్ పై పి.వి.పి నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









