నాగార్జున చిత్రం వచ్చే ఏడాది మొదటి వారం లో రిలీజ్
- October 22, 2015
అక్కినేని నాగార్జున , తమిళ్ హీరో కాంబినేషన్ లో ఒకేసారి తెలుగు - తమిళ భాషల్లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం 'ఊపిరి'. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో రాబోతున్న ఈ చిత్రం తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇంకా ఒక నెల రోజుల షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. ప్రస్తుతం నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా' షూటింగ్ లో బిజీగా ఉండడం వలన ఊపిరి సినిమాకి బ్రేక్ ఇచ్చారు. తాజా సమాచారం ఈ నెల చివరిన షూటింగ్ ని మొదలు పెట్టి నవంబర్ చివరికల్లా పూర్తి చేయనున్నారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి మరో నెల రోజుల సమయం పడుతుంది. ముందుగా ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్న షూటింగ్ ఆలస్యం కావడం వల్ల వచ్చే ఏడాది మొదటి వారం లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ చిత్ర రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటన చేయనున్నారని వార్త. నాగార్జున ఈ సినిమాలో ఎక్కువ భాగం వీల్ చెయిర్ లోకనిపిస్తాడు. ఈ సినిమాలో వీరితో పాటు ఓ ముఖ్య పాత్రలో అనుష్క - అడవి శేష్ జంటగా కనిపించనున్నారు. విపి బ్యానర్ పై పి.వి.పి నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







