ఖమ్మంలో పైసా వసూల్
- August 13, 2017
బా లకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'పైసా వసూల్'. శ్రియ, ముస్కాన్, కైరాదత్ కథానాయికలు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనంద్ప్రసాద్ నిర్మాత. సెప్టెంబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నెల 17న ఖమ్మంలో పాటల విడుదల వేడుకని నిర్వహించబోతున్నారు. అదే రోజునే ట్రైలర్ని కూడా విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. నిర్మాత మాట్లాడుతూ ''ముందుగా ప్రకటించిన విడుదల తేదీ కంటే, నెల రోజులు ముందుగానే మా 'పైసా వసూల్' విడుదలవుతోంది. బాలకృష్ణతో ఆ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఆయన వేగం, పూరి జగన్నాథ్లోని స్పష్టత వల్లే ఇంత ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన స్టంపర్కి మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి. అందుకు దీటుగానే చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు.
బాలకృష్ణ నటన, పూరి జగన్నాథ్ సినిమాని తీర్చిదిద్దిన విధానం సినిమాకి ప్రధాన ఆకర్షణ. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన గీతాలు అందరినీ అలరించనున్నాయి'' అన్నారు. కబీర్ బేడితో పాటు అలీ, పృథ్వీ, పవిత్రా లోకేష్, విక్రమ్ జిత్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







