పాక్ స్వాతంత్ర్య వేడుకలకు అతిథి ఎవరో తెలుసా!
- August 13, 2017
ఇస్లామాబాద్: భారత స్వాతంత్ర్యదినోత్సవానికి ఒక్కరోజు ముందు జరిగే పాకిస్తాన్ ఇండిపెండెన్స్డే సెలబ్రేషన్స్కు ఈఏడాది ఊహించిన అతిథి హాజరుకానున్నారు. అవును.. ఆ అతిథి.. చైనా ఉన్నత నాయకుడే!
చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్ సూచనమేరకు ఆ దేశ ఉపప్రధాని వాంగ్యాంగ్ సోమవారం(ఆగస్టు 14న) జరగనున్న పాక్ 70వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రాజధాని ఇస్లామాబాద్లో జరిగే వేడుకలో ప్రధాని షాహిద్ అబ్బాసీతోకలిసి వాంగ్ పాల్గొంటారని పాక్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన కొన్నేళ్లుగా ఆర్థిక, రక్షణరంగాల్లో సహకారం అందిస్తూ చైనా.. పాకిస్తాన్కు ఆప్తమిత్రురాలిగా మారడం, అంతర్జాతీయ వేదికలపై పాక్కు వ్యతిరేకంగా ఉండే ఎలాంటి నిర్ణయాలనైనా చైనా వీటో చేస్తున్న తెలిసిందే.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







