ఇండోనేషియా ను వణికించిన మరో భూకంపం

- August 13, 2017 , by Maagulf
ఇండోనేషియా ను వణికించిన మరో భూకంపం

జకార్తా: ఇండోనేషియాలోని సమత్రా దీవుల్లో ఆదివారం నాడు భూకంపం చోటుచేసుకొంది. బెంగ్‌కులు ప్రాంతానికి 73 కి.మీ. దూరంలోని భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
భూకంపలేఖినిపై 6.5 తీవ్రత నమోదైంది. అయితే ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు ప్రకటించారు.
సమత్రా దీవుల్లో సంభవించిన భూకంపం కారణంగా సింగపూర్‌లో కూడ అక్కడక్కడ ప్రకంపనలు చోటుచేసుకొన్నాయి. ప్రజలంతా భయంతో ఇళ్ళలో నుండి బయటకు వచ్చారు.
ఎప్పుడు ఏం జరుగుతోందోననే భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్ళనుండి బయటనే నిరీక్షిస్తున్న పరిస్థితి కన్పిస్తోంది.
గత ఏడాది డిసెంబర్‌లో ఇండోనేషియాలోని ఏస్ ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపం కారణంగా వందమంది చనిపోయారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
తాజాగా చోటుచేసుకొన్న భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తినష్గం గురించి ఇంకా వివరాలు అందాల్సి ఉందని అధికారులు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com