ఇరాక్ లో సల్ఫర్ మస్టర్డ్ దాడులు
- October 22, 2015
ఇరాక్ లో అమానుషాలకు ఒడిగడుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తాజాగా రసాయన దాడులకు సైతం తెగబడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాక్ లోని కుర్దిష్ సేనలపై ఐఎస్ఐఎస్ గ్రూప్ నిషేధిత రసాయన ఆయుధ దాడులు జరుపుతున్నట్టు దౌత్యవర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు సల్ఫర్ మస్టర్డ్ దాడులు జరిగాయా? లేదా? అన్నది ధ్రువీకరించాలని అవి అంతర్జాతీయ పర్యవేక్షకులను కోరాయి. ఐఎస్ ఉగ్రవాదులు ఇటీవల కుర్దిష్ బలగాలకు చెందిన 35 దళాలపై అజ్ఞాత దాడులు జరిపారు. ఈ దాడుల్లో పలువురు సైనికులకు విపరీతమైన గాయాలయ్యాయి. వీరి గాయాలను పరిశీలిస్తే.. ఇవి నిషేధిత రసాయన వాయువులతో చేసిన దాడులు అయి ఉంటాయని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రసాయన ఆయుధాలపై నిషేధం కోసం కృషిచేస్తున్న ఓపీసీడబ్ల్యూ సంస్థ బృందం ఇరాక్ లో పర్యటించి.. ఈ దాడులకు సంబంధించిన వాస్తవాలను వెలికితీసుకురానుంది. మరోవైపు వరుస వైమానిక దాడులతో బలహీనపడుతున్న ఐఎస్ఐఎస్ 14 ఏళ్ల బాలురను సైతం ఉగ్రవాద గోదాలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నది. తన అధీనంలో ఉన్న 14 ఏళ్లు, ఆ పైచిలుకు బాలురను సమీకరించేందుకు యత్నిస్తున్నది. ఇందులో భాగంగా ఉత్తర జిల్లాలోని రఖ్కా నగరంలో 14 ఏళ్ల పైచిలుకు అబ్బాయిలు తమ పేర్లను నమోదుచేయించుకోవాలని ఆ గ్రూప్ సర్క్యులర్ జారీ చేసింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









