సిబు పసిఫిక్ ద్వారా ఫిలిప్పీన్ దేశస్థులకు సాంకేతిక రుసుము లేదు
- August 14, 2017
దుబాయ్: సిబు పసిఫిక్ ద్వారా ఫిలిప్పీన్ దేశస్థులకు సాంకేతిక రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. యూఏఈ విమాన టిక్కెట్ల కొనుగోలులో విదేశీ ఫిలిప్పిన్ కార్మికులకు ఇకపై వారి ప్రభుత్వం విధించే 50 ధిర్హాంల విమానాశ్రయ రుసుమును ఇకపై సిబు పసిఫిక్ వసూలు చేయదు.ఫిలిప్పీన్ దేశంలో అతిపెద్ద విమాన సంస్థ అయిన సెబు పసిఫిక్ అంతర్జాతీయ ప్రయాణీకుల సర్వీస్ ఛార్జ్ (ఐ పి ఎస్ సి) లేదా టెర్మినల్ రుసుము నుండి ప్రయాణీకులను మినహాయించింది. నియోయ్ అక్వినో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎన్.ఎ.ఐ.య. వారు సెబు పసిఫిక్ లో వారి విమానాలలో సీటుని బుక్ చేయడంలో ఎటువంటి సంబంధం లేకుండా ఫీజు మినహాయింపుని కల్పిస్తుంది..మనీలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ( ఎం ఐ ఎ ఎ ) మధ్య మార్చిలో మనీలాలో 40 ఎయిర్లైన్స్ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏప్రిల్ 30 వ తేదీ ప్రారంభంలో ఓ ఎఫ్ డబ్ల్యు 550 పేసో టెర్మినల్ రుసుమును అధికారికంగా రద్దు చేయడం జరిగింది.. ఎమిరేట్స్ వెంటనే దీనికి కట్టుబడి ఉంది.గత ఏడాది అక్టోబరులో ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యునికేషన్స్ డిపార్ట్మెంట్ అన్ని ఫీజుల నుండి మినహాయింపు పొందింది, వినియోగదారుల అందరి నుండి వైమానిక సంస్థల ద్వారా రుసుము వసూలు చేయడం ప్రారంభించారు. ఓ ఎఫ్ డబ్ల్యు బోర్డింగ్ గేట్లు సమీపంలో వాపసు కోసం క్యూ లలో ఉన్నారు. సేబు పసిఫిక్ యొక్క కార్పొరేట్ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ జె ఆర్ అట్టి మాంటరింగ్, ఈ సందర్బంగా మాట్లాడుతూ ఓ ఎఫ్ డబ్ల్యు అందరికి మినహాయించాలనే చర్యను వేలమంది వారివారి ఉద్యోగ స్థలాలకు సేబు పసిఫిక్లో విమానాల ద్వారా విమాన టికెట్లను బుక్ చేసుకునేవారికి లబ్ధి చేకూరుతుందని అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







