హైదరాబాద్ లో షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో ఫ్రీడం వాక్‌

- August 14, 2017 , by Maagulf
హైదరాబాద్ లో షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో ఫ్రీడం వాక్‌

హైదరాబాద్‌ను సేఫ్‌ సిటీగా మార్చడమే షీ టీమ్స్‌ లక్ష్యమన్నారు సైబర్‌ క్రైం అడిషనల్‌ కమిషనర్‌ స్వాతి లక్రా. హైటెక్‌ సిటీలో పంద్రాగస్టు సందర్భంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడం వాక్‌ను ఆమె ప్రారంభించారు. ఈ వాక్‌లో టీమిండియా ఉమెన్‌ క్రికెటర్‌ సునీత ఆనంద్‌ కూడా పాల్గొన్నారు. దేశంలో అత్యాచారాలు, దాడుల నుంచి  స్త్రీలు పూర్తి స్వాతంత్ర్యం కోరుకుంటున్నారని లక్రా అన్నారు. అర్థరాత్రి మహిళలు రోడ్డుపై ఒంటరిగా ధైర్యంగా నడవగలిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లన్న గాంధీజీ మాటల్ని ఆమె గుర్తు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com