పశ్చిమ ఆఫ్రికాలో రెస్టారెంట్పై ఉగ్ర దాడి
- August 15, 2017
- బుర్కినా ఫాసోలో 20 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసో రాజధాని ఓగాడొగులో ఒక రెస్టారెంట్పై తీవ్రవాదులు జరిపిన దాడిలో 20మంది మరణించారని, పలువురు గాయపడ్డారని ప్రభుత్వం తెలిపింది. సాయుధులైన దుండగులు రెస్టారెంట్ వెలుపల కూర్చున్న కస్టమర్లపై కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరణించినవారిలో విదేశీయులు కూడా వున్నారని, అయితే వారు ఏ దేశస్తులనే విషయం ఇంకా తెలియరాలేదని ఒక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. ఈ దాడి అల్ఖైదా అనుబంధ సంస్థల పనే అయివుంటుందని అనుమానిస్తున్నారు. రెస్టారెంట్పై సాయుధులు దాడి చేయడంతో భద్రతా బలగాలు కూడా ఎదురు దాడి జరిపాయని, 11మందిని కాపాడగా, వారిలో ఒకరు ఆస్పత్రిలో మరణించాడని కమ్యూనికేషన్స్ మంత్రి రెమిస్ తెలిపారు. ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారనేది తెలియలేదని చెప్పారు. దాడి చేసిన భవనంలో ఒక భాగానికే తీవ్రవాదులు పరిమితమయ్యారని, భద్రతా బలగాలు మొత్తంగా గాలింపు చర్యలు చేపట్టాయని మంత్రి తెలిపారు. కాగా, ఇద్దరు దుండగులను భద్రతా బలగాలు చంపివేశాయని, దాడి ముగిసినట్లేనని ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ప్రారంభమైన ఈ దాడి సోమవారం తెల్లవారు జామున 5గంటలకు ముగిసిందని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







