పశ్చిమ ఆఫ్రికాలో రెస్టారెంట్పై ఉగ్ర దాడి
- August 15, 2017
- బుర్కినా ఫాసోలో 20 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసో రాజధాని ఓగాడొగులో ఒక రెస్టారెంట్పై తీవ్రవాదులు జరిపిన దాడిలో 20మంది మరణించారని, పలువురు గాయపడ్డారని ప్రభుత్వం తెలిపింది. సాయుధులైన దుండగులు రెస్టారెంట్ వెలుపల కూర్చున్న కస్టమర్లపై కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరణించినవారిలో విదేశీయులు కూడా వున్నారని, అయితే వారు ఏ దేశస్తులనే విషయం ఇంకా తెలియరాలేదని ఒక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. ఈ దాడి అల్ఖైదా అనుబంధ సంస్థల పనే అయివుంటుందని అనుమానిస్తున్నారు. రెస్టారెంట్పై సాయుధులు దాడి చేయడంతో భద్రతా బలగాలు కూడా ఎదురు దాడి జరిపాయని, 11మందిని కాపాడగా, వారిలో ఒకరు ఆస్పత్రిలో మరణించాడని కమ్యూనికేషన్స్ మంత్రి రెమిస్ తెలిపారు. ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారనేది తెలియలేదని చెప్పారు. దాడి చేసిన భవనంలో ఒక భాగానికే తీవ్రవాదులు పరిమితమయ్యారని, భద్రతా బలగాలు మొత్తంగా గాలింపు చర్యలు చేపట్టాయని మంత్రి తెలిపారు. కాగా, ఇద్దరు దుండగులను భద్రతా బలగాలు చంపివేశాయని, దాడి ముగిసినట్లేనని ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ప్రారంభమైన ఈ దాడి సోమవారం తెల్లవారు జామున 5గంటలకు ముగిసిందని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..









