పశ్చిమ ఆఫ్రికాలో రెస్టారెంట్పై ఉగ్ర దాడి
- August 15, 2017
- బుర్కినా ఫాసోలో 20 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసో రాజధాని ఓగాడొగులో ఒక రెస్టారెంట్పై తీవ్రవాదులు జరిపిన దాడిలో 20మంది మరణించారని, పలువురు గాయపడ్డారని ప్రభుత్వం తెలిపింది. సాయుధులైన దుండగులు రెస్టారెంట్ వెలుపల కూర్చున్న కస్టమర్లపై కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరణించినవారిలో విదేశీయులు కూడా వున్నారని, అయితే వారు ఏ దేశస్తులనే విషయం ఇంకా తెలియరాలేదని ఒక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. ఈ దాడి అల్ఖైదా అనుబంధ సంస్థల పనే అయివుంటుందని అనుమానిస్తున్నారు. రెస్టారెంట్పై సాయుధులు దాడి చేయడంతో భద్రతా బలగాలు కూడా ఎదురు దాడి జరిపాయని, 11మందిని కాపాడగా, వారిలో ఒకరు ఆస్పత్రిలో మరణించాడని కమ్యూనికేషన్స్ మంత్రి రెమిస్ తెలిపారు. ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారనేది తెలియలేదని చెప్పారు. దాడి చేసిన భవనంలో ఒక భాగానికే తీవ్రవాదులు పరిమితమయ్యారని, భద్రతా బలగాలు మొత్తంగా గాలింపు చర్యలు చేపట్టాయని మంత్రి తెలిపారు. కాగా, ఇద్దరు దుండగులను భద్రతా బలగాలు చంపివేశాయని, దాడి ముగిసినట్లేనని ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ప్రారంభమైన ఈ దాడి సోమవారం తెల్లవారు జామున 5గంటలకు ముగిసిందని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!
- నాలుగు రెట్లు పెరిగిన ఒమన్-రష్యా వాణిజ్యం..!!
- ఒమన్ తో ఇండస్ట్రియల్ సహకారంపై చర్చించిన అల్ఖోరాయెఫ్..!!
- క్రెడిట్ కార్డు నిబంధనలను కఠినతరం చేయాలని ఎంపీల ఒత్తిడి..!!
- ఖతార్లో మెరైన్ వార్నింగ్ జారీ..!!
- ఇరాక్ కొత్త ప్రధానిగా అలీ అల్-జైదీ
- శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ
- విద్యార్థులకు కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం రేవంత్
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!









