సమ్మర్ వర్క్ బ్యాన్: 80 సంస్థల ఉల్లంఘన
- August 16, 2017
మొత్తం 80 సంస్థలు సమ్మర్ వర్క్ బ్యాన్ నిబంధనను ఉల్లంఘించినట్లు అధికారులు వెల్లడించారు. జులై 1 నుంచి ఇప్పటిదాకా నమోదైన ఉల్లంఘనల సంఖ్య 80 అని లేబర్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఉల్లంఘనులకు చట్ట ప్రకారం జరీమానాలు ఉంటాయని అధికారులు తెలిపారు. 80 సంస్థలకు చెందిన 150 మంది కార్మికులు బ్యాన్ పీరియడ్లో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎండ తీవ్రత కారణంగా బహిరంగ ప్రదేశాల్లో కార్మికులు పని చేయడం పట్ల బ్యాన్ విధించడం జరుగుతోంది. 2007 నుంచి ఈ బ్యాన్ అమల్లో ఉంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత నేపత్యంలో ఎండలో పనిచేసే కార్మికులు తీవ్రమైన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే నిబంధనల్ని ఉల్లంఘించి పలు సంస్థలు కార్మికులతో బ్యాన్ చేసిన సమయాల్లోనూ పనిచేయించడం కనిపిస్తుంటుంది. ఇలాంటి సంస్థలపై ఎప్పటికప్పుడు దాడులను నిర్వహిస్తారు అధికారులు. ఒక్కో కార్మికుడికి 500 నుంచి 1000 బహ్రెయినీ దినార్స్ చొప్పున ఆయా సంస్థలు జరీమానా చెల్లించవలసి ఉంటుంది. మొత్తం 77,500 బహ్రెయినీ దినార్స్ ఆయా సంస్థల నుంచి జరీమానాలుగా రావొచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







