రానున్న రోజుల్లో మరింత వేడి వాతావరణం
- August 16, 2017
రానున్న రోజుల్లో మరింత వేడి వాతావరణం అలాగే తేమతో కూడిన వాతావరణం ఉండొచ్చని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ అండ్ సెస్మాలసీ వెల్లడించిన వివరాల ప్రకారం ఎమిరేట్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకూ ఉండొచ్చు సాయంత్రం సమయాల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా మరింత ఇబ్బందికర పరిస్థితులు చోటుచేసుకుంటాయి. యూఏఈ ఈస్టర్న్ మౌంటెనియస్ ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు మించకపోవచ్చు. ఈస్టర్న్ అలాగే సదరన్ ఏరియాస్లో కొంత మేర మేఘాలు కనిపించవచ్చుననీ, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వెదర్ సెంటర్ పేర్కొంది. శుక్రవారం ఉదయానికి హ్యుమిడిటీ బాగా పెరగనుంది. సెప్టెంబర్ నెలాఖరు వరుకు పరిస్థితులు ఇలాగే ఉండొచ్చు. ఆ తర్వాత క్రమక్రమంగా పరిస్థితులు మెరుగుపడ్తాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







