చాకో కేక్
- August 18, 2017
కావలసినవి: మైదా ఒకటిన్నర కప్పులు, వంట సోడా ఒకటిన్నర టీ స్పూన్, ఉప్పు పావు టీ స్పూను, గుడ్లు 2, చక్కెర ఒకటిన్నర కప్పులు, నూనె అర కప్పు, పెరుగు ఒకటిన్నర కప్పు, వెనీలా ఎసెన్స్ ఒక టీ స్పూను, కోకో పౌడర్ ఒక కప్పు, కుకింగ్ చాకొలేట్ తురుము 100 గ్రా.
ఎలా చేయాలి
ముందుగా ఒవెన్ను 200 డిగ్రీల సెంటిగ్రేడ్లో వేడి చేయాలి. మైదాలో వంటసోడా, ఉప్పు కలిపి జల్లించి పక్కన పెట్టుకోవాలి. గుడ్ల మిశ్రమంలో చక్కెరను వేసి ఐదు నిమిషాల పాటు గిలక్కొట్టాలి. ఈ మిశ్రమంలో నూనె కూడా పోసి మరి కొద్దిసేపు గిలక్కొట్టాలి. తర్వాత పెరుగు, వెనీలా ఎసెన్స్ను వేసి బాగా కలపాలి. తర్వాత మైదా మిశ్రమాన్ని, కోకో పౌడర్ను కూడా వేసి కలపాలి.
8 ్ఠ 8 సైజు గిన్నెలో నెయ్యి లేదా నూనె పూసి దానిలో కొద్దిగా మైదా పిండిని చల్లాలి. ఈ గిన్నెలో పై మిశ్రమాన్ని పోసి 180 డిగ్రీల సెంటీగ్రేడ్లో 40 నిమిషాల పాటు బేక్ చేయాలి. కేక్ కొద్దిగా వేడిగా ఉండగానే కుకింగ్ చాకొలేట్ని దాని పైన పోసి చెక్క గరిటతో సమానంగా ఉండేలా సర్దాలి. రంగురంగుల స్ర్పింక్లర్స్ను పైన అందంగా అలంకరించాలి.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









