మూత్రంతో పాటుగా వీర్యం బయటకు పోతుంటే... ఈ పండుతో కట్
- August 18, 2017అరటి పలు రకాలుగా వుంటుంది. మనకు తెలసినవి కూర అరటి, చక్కెరకేళి, అమృతపాణి మాముల అరటి, పచ్చఅరటి పండు ఇలా అనేక రకాలు ఉంటాయి. దీనిలో చాల ఔషధ గుణాలు ఉన్నాయి. దీని ఔషధ గుణాలు గుర్తించి కాబోలు నాటి పెద్దలు తాంబూలాన్ని దేవునికి సమర్పించేటప్పుడు తప్పనిసరిగా అరటిపళ్ళను తమలపాకులలో వుంచుతారు. అరటిపండు లేనిదే పూజా కార్యక్రమం పూర్తికాదు. అరటి చెట్టు తెలుగువారి దైనందిన జీవితంలో ఒక భాగం అంటే అతిశయోక్తికాదు.
అరటి పువ్వును కూరల్లో వాడటం ఇక్కడ విశిష్టత. అంతేకాదు అరటి బోదెలను, ఆకులను శుభకార్యాలకు వాడుతారు. అరటి జీర్ణశక్తికి ఉపకరిస్తుంది. లేత అరటికాయ కూర త్వరగా జీర్ణం అవుతుంది. అరటి కాయ కూర వేడి చేసే గుణం కలదు. అరటి పండు చలువు చేసే గుణంకలదు. అరటి జీర్ణకోశవ్యాధులకు అత్యుత్తమమైనది. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణంకావడం కోసం రోజుకొక అరటిపండు తీసుకోవడం మంచిది.
అంతేకాదు కడుపులో ఆమ్లత్వం వున్నవారు తరుచూగా అరటిపండు తీసుకోవడం మంచిది. రక్త విరేచనాలు, జిగట విరేచనాలు అవుతుంటే బాగా మిగలపండిన చక్కెరకేళి అరటి పండును, పాత చింతపండు, పాతబెల్లం మూడింటిని సమపాళ్ళలో తీసుకొని బాగా కలిపి ఒక చెంచా మోతాదు చొప్పున రోజుకు మూడుసార్లు లేక నాలుగుసార్లు తీసుకోవాలి. మలబద్దకాన్ని అరికట్టడానికి అరటి పండును మించిన వైద్యం లేదు.
మొలల వ్యాధికి మూల కారణం మలబద్దకం. అలాంటి మలబద్దకాన్ని దూరం చేస్తే మొలల వ్యాధి మాత్రమే కాక ఇంకా అనేక రోగాలు రాకుండా వుంటాయి. అరటిపండు రక్తవృద్ధి కలిగిస్తుంది. అరటి పళ్ళలో చక్కెరకేళి శ్రేష్ఠమైనది. అరటిలో అమృతపాణి పండును తొక్క నల్లగా మిగలపండేలా చేసి తింటే మంచిది.
అరటిపండు బి.పి. వ్యాధిలో బాగా పని చేస్తుంది. అంతేకాదు హృదయ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులలోను, కాలేయ వ్యాధులలోనూ బాగా పనిచేస్తుంది. ఈ వ్యాధులు ఉన్నవారు అరటి ఆకులలో భోజనం చేయడం మంచిది. స్వప్న స్ఖలనాలు, మూత్రంతో పాటుగా వీర్యం బయటకు పోయేటప్పుడు, నపుంసకత్వంలోనూ అరటి బాగా పని చేస్తుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్