బెంగాలి స్టైల్ మసాలా ఫిష్ ఫ్రై
- August 19, 2017
కావాల్సిన పదార్థాలు:
కోల్కత బెట్కి (పండు గొప్ప) ఫిల్లెట్ - 150గ్రాములు, కసుంది మస్టర్డ్ - 50గ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, పచ్చి మిర్చి (మెత్తగా నూరి)- మూడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 30గ్రాములు, కొత్తిమీర, పచ్చిమిర్చి గుజ్జు - 50గ్రాములు, బ్లాక్సాల్ట్ - రుచికి తగినంత, కోడిగుడ్డు - ఒకటి, ఆవనూనె - 15మిల్లీలీటర్లు, కారం - 10గ్రాములు, పసుపు - మూడు గ్రాములు, బ్రెడ్ ముక్కలు - కొన్ని.
తయారీ విధానం:
చేపను నాలుగు ముక్కలుగా కోసి శుభ్రంగా కడగాలి.
ఒక గిన్నెలో కసుంది మస్టర్డ్, ఉప్పు, కారం, పసుపు, తాజా కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి గుజ్జు వేసి కలపాలి.
చేప ముక్కలను ఈ మిశ్రమంలో వేసి ముక్కలకి ఆ గుజ్జు బాగా పట్టేలా కలిపి ఫ్రిజ్లో అరగంటసేపు ఉంచాలి.
మరో పాత్రలో కోడిగుడ్డు సొన వేసి బాగా గిలక్కొట్టాలి.
ఇందులో చేప ముక్కల్ని ముంచి తరువాత బ్రెడ్ ముక్కల మీద దొర్లించాలి.
వీటిని వేడి నూనెలో వేసి వేగిస్తే చేప వేపుడు రెడీ. ఈ ముక్కల్ని వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







