శ్రీ నివాస్‌ చేస్తున్న 'ఆటో నంబర్ 143'

- August 23, 2017 , by Maagulf
శ్రీ నివాస్‌ చేస్తున్న 'ఆటో నంబర్ 143'

శ్రీ నివాస్‌, రష్మి రాజ్‌పుత్‌ జంటగా లక్ష్మణ్‌ సినీ విజన్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'ఆటో నెంబర్‌ 143'. సతీష్‌చంద్ర నాదెళ్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లక్ష్మణ్‌ క్యాదరి నిర్మాత. ఆయన మాట్లాడుతూ ''మా సంస్థలో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. 'మేం వయసుకు వచ్చాం', 'అబ్బాయి క్లాస్‌ అమ్మాయి మాస్‌' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మరో మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. అన్నిరకాల భావోద్వేగాలతో కూడిన ఓ తీయటి ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది'' అన్నారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు: లక్ష్మీభూపాల్‌, ఛాయాగ్రహణం: వినోద్‌ రాజేంద్రన్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com