మిరియాల పొడి, ఒక గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం తీసుకుంటే...
- August 24, 2017
ఎన్నో అనారోగ్య సమస్యలను ఇట్టే నయం చేయగల దినుసులు మన ఇంట్లోనే వున్నాయి. వాటిలో మిరియాలు కూడా వుంటాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. శరీరంలో ఏర్పడే నొప్పులు, వాపులు, మోకాళ్ల నొప్పికి మిరియాలు చెక్ పెడుతుంది. గొంతునొప్పి, ఉదర సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. మిరియాల పొడి 50 గ్రాములు తీసుకుని అందులో 600 మి.లీటర్ల నీరు చేర్చి 30 నిమిషాల పాటు వేడి చేయాలి. ఈ నీటిని వడగట్టి రోజూ మూడు పూటలూ 25 మి.లీ చొప్పున తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
జుట్టు రాలిపోతుంటే మిరియాల పొడి, ఉప్పు, ఉల్లిపాయలు మూడింటిని సరిపాళ్ళతో తీసుకుని బాగా పేస్ట్లా చేసుకుని జుట్టు పెరగని చోట రాస్తే జుట్టు పెరుగుతుంది. జ్వరం. జలుబుకు ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
మిరియాలు ఉదరంలోని వాతాన్ని తొలగించి శరీరానికి ఉష్ణాన్ని ఇవ్వడంతో పాటు వాపులను నయం చేస్తుంది. మిరియాల పొడిని ఉప్పుతో కలిపి బ్రష్ చేసుకుంటే పంటినొప్పి, పళ్ళు పుచ్చిపోవుట, చిగుళ్ల నొప్పి, నోటి దుర్వాసను నిరోధించవచ్చు. అరగ్రాము మిరియాల పొడి, ఒక గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం సాయంత్రం తీసుకుంటే తలభారం, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







