కొత్త ఛార్జీలతో వాటర్‌, ఎలక్ట్రిసిటీ రేషనలైజేషన్‌

- August 24, 2017 , by Maagulf
కొత్త ఛార్జీలతో వాటర్‌, ఎలక్ట్రిసిటీ రేషనలైజేషన్‌

కువైట్:మినిస్ట్రీ ఆఫ్‌ ఎకానమీ అండ్‌ వాటర్‌ ఫర్‌ ప్లానింగ్‌ అండ్‌ ట్రైనింగ్‌ అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ మషాన్‌ అల్‌ ఒతైబీ మాట్లాడుతూ, నీళ్ళు మరియు ఎలక్ట్రిసిటీకి సంబంధించి కొత్త రేట్లతో వినియోగదారులు వీటి వినియోగం పట్ల మరింత అప్రమత్తంగా ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి ఈ కొత్త ధరలు. కిలోవాట్‌కి ఐదు ఫిల్స్‌, 1,000 ఇంపీరియల్‌ గ్యాలన్స్‌ ఆఫ్‌ వాటర్‌ కోసం రెండు దినార్స్‌ ఇక నుంచి చెల్లంచాల్సి ఉంటుంది. మినిస్ట్రీ రోజుకి 350,000 బ్యారెల్స్‌ చమురుని మండించి, పవర్‌ని జనరేట్‌ చేయాల్సి వస్తోంది. 2035 నాటికి రెండు మిలియన్‌ బ్యారెల్స్‌ చమురును మండించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే వాడకం విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలనే ఉద్దేశ్యంతో ధరల్ని పెంచవలసి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com