అదా ప్రదమాన్
- August 24, 2017
కావలసిన పదార్థాలు: అటుకులు - 100 గ్రా, బెల్లం తరుగు - పావు కిలో, పల్చని కొబ్బరి పాలు - 5 కప్పులు, చిక్కని కొబ్బరి పాలు- 1 కప్పు, నెయ్యి-2 టే.స్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూను, జీలకర్ర పొడి - పావు టీస్పూను, కొబ్బరి ముక్కలు - 2 టే.స్పూన్లు, జీడిపప్పు, ఎండుద్రాక్ష - తగినన్ని
తయారీ విధానం:
బెల్లం కరిగించి పక్కన పెట్టుకోవాలి.
గిన్నెలో నీళ్లు వేడి చేసి మరిగాక మంట తీసి అటుకులు వేసి 15 నిమిషాలు నానబెట్టాలి.
తర్వాత పల్చని కొబ్బరి పాలు పోసి కలిపి చిన్న మంట మీద అటుకులు మెత్తబడేవరకూ ఉడికించాలి.
చిక్కబడ్డాక బెల్లం వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి.
మరో గిన్నెలో నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు వేయించి తీయాలి.
అలాగే జీడిపప్పు, ఎండుద్రాక్ష కూడా వేయించు కోవాలి.
అటుకులు మెత్తగా ఉడికిన తర్వాత చిక్కని కొబ్బరి పాలు పోసి మంట తీసేయాలి.
కొబ్బరి పాలు పోశాక ఉడికిస్తే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి పాలు పోసిన వెంటనే మంట తీసేయాలి.
దీన్లో వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష, కొబ్బరి ముక్కలు, యాలకుల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి వడ్డించాలి.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









