భారతీయ యువ ఇంజినీర్ కు బ్రిటన్ రాణి ఆహ్వానం
- October 25, 2015
భారతీయ సంతతి యువ ఇంజినీర్ యువతికి ఊహించని ఆహ్వానం అందింది. తన ప్యాలెస్ కు ఓసారి వచ్చి పోవాలంటూ ఏకంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 రోమా అగర్వాల్(29) కు ఆహ్వానం పలికింది. లండన్ లోని షార్ద్ అనే ప్రాంతంలో యూరప్ లోనే అత్యంత ఎత్తయిన భవన నిర్మాణంలో ఇంజినీర్ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ సందర్భంగా వారికోసం ఏర్పాటుచేసిన విందు కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఎలిజబెత్ ప్రత్యేక ఆహ్వానం పలికారు. దీంతో ఆమె తన సహచర ఇంజినీర్లతో కలిసి అత్యంత విలాసవంతమైన బ్రిటన్ ప్యాలెస్ లోకి అడుగు పెట్టనుంది. ఈ సందర్భంగా ఎంఎస్ అగర్వాల్ స్పందిస్తూ మహిళా ఇంజినీర్లపై ఎంతో కాలంగా ఉన్న ఛాందసమైన ఆలోచన తప్పని, యువతులు దీనిని ఆహ్లాదభరితంగా తీసుకొని కెరీర్ మలుచుకొని ఇంజినీర్లుగా రాణించాలని సూచించారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







