ఫిల్మ్‌నగర్‌ వినాయకుడికి సురుచి ఫుడ్స్‌ వారి 500కిలోల లడ్డూ

- August 25, 2017 , by Maagulf
ఫిల్మ్‌నగర్‌ వినాయకుడికి సురుచి ఫుడ్స్‌ వారి 500కిలోల లడ్డూ

వినాయకుడి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రముఖ సినీనటుడు, ఎంపీ మురళీమోహన్‌ అన్నారు. భగవంతుడి ఆశీస్సులతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధిలో పోటీ పడాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని దైవ సన్నిధానంలో వినాయక ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌ వారు ప్రత్యేకంగా తయారుచేసిన 500కిలోల లడ్డూను స్వామివారికి సమర్పించారు. లడ్డూను సమర్పించిన సురుచి ఫుడ్స్‌ వారికి స్వామివారి దీవెనలు ఉండాలని మురళీమోహన్‌ ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com