స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎంపికైన నల్గొండ విద్యార్ధి
- August 25, 2017
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కబడ్డీ అకాడమీకి నల్లగొండ విద్యార్థి తరి మధు ఎంపికయ్యాడు. పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన తరి మధు బొట్టుగూడ స్కూల్లో చదువుతూ ఎస్సీ వసతిగృహంలో ఉంటున్నాడు. ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో తర్ఫీదు పొందుతూ రాష్ట్ట్ర స్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ ఎంపిక పోటీల్లో పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు. కాగా... ఆయన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కబడ్డీ అకాడమీ జట్టుకు ఎంపిక కావటం విశేషం. ఈయన ఎంపికపై క్లబ్ అధ్యక్ష ప్రధాన, కార్యదర్శులు మందడి నర్సిరెడ్డి, బొమ్మపాల గిరిబాబు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









