స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎంపికైన నల్గొండ విద్యార్ధి
- August 25, 2017
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కబడ్డీ అకాడమీకి నల్లగొండ విద్యార్థి తరి మధు ఎంపికయ్యాడు. పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన తరి మధు బొట్టుగూడ స్కూల్లో చదువుతూ ఎస్సీ వసతిగృహంలో ఉంటున్నాడు. ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో తర్ఫీదు పొందుతూ రాష్ట్ట్ర స్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ ఎంపిక పోటీల్లో పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు. కాగా... ఆయన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కబడ్డీ అకాడమీ జట్టుకు ఎంపిక కావటం విశేషం. ఈయన ఎంపికపై క్లబ్ అధ్యక్ష ప్రధాన, కార్యదర్శులు మందడి నర్సిరెడ్డి, బొమ్మపాల గిరిబాబు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







