ఎక్కిళ్ళు చిటికిలో పోగొట్టొచ్చు..ఇలా
- August 25, 2017ఎక్కిళ్ళను మనమందరం ఏదో ఒక సంధర్భంలో ఎదుర్కొంటాం. తినే సమయంలో అయితే ఆ బాధ మాటల్లో చెప్పలేము. ఎక్కిళ్ళ సమయంలో తృప్తిగా తినలేము. మనకు వచ్చే ఎక్కిళ్ళు సాధారణమైన ఎక్కిళ్ళయితే సడెన్గా షాకింగ్ న్యూస్ చెబితే ఆగిపోతుంది. కారణం మన మెదడుకు ఆ షాకింగ్ న్యూస్ వెళ్ళి మిగిలిన ప్రక్రియ ఆగిపోతుంది. దాంతో పాటు మరో చిట్కా కూడా ఉంది.
అలాగే సొంటి ఎక్కిళ్ళను బాగా పనిచేస్తుంది. శొంఠిని పొడి చేసి బెల్లంతో కలిపి పీలిస్తే ఎక్కిళ్ళు ఆగిపోతుంది. అంతే కాదు సొంటి, తేనెను కలిపి సేవిస్తే ఎక్కిళ్ళు తగ్గుతుంది. ఎక్కువగా ఎక్కిళ్ళు చిన్న పిల్లలకు వస్తాయి. చిన్నపిల్లలకు ఇలా వస్తే వారిని బోర్లా పడుకోబెట్టి తడితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.
అంతేకాదు నీళ్ళలో చక్కెర కలుపుకుని చిన్నపిల్లలకు తాగిస్తే తగ్గిపోతుంది. ఎక్కువగా ఎక్కిళ్ళు వస్తుంటే నల్లతుమ్మచెట్టు ముళ్ళు 20 గ్రాములు నలగ్గొట్టి అరకప్పు మంచినీటిలో వేసి సగం కాషాయం అయ్యే వరకు మరగబెట్టి దించి వడపోసి ఆ కషాయం గోరువెచ్చగా అయిన తరువాత ఒక చెంచా తేనె కలిపి రెగ్యులర్గా తాగితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం