మరోసారి బాలకృష్ణతో పూరీ!

- August 26, 2017 , by Maagulf
మరోసారి బాలకృష్ణతో పూరీ!

నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'పైసా వసూల్‌'. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, ఆడియోతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అలాగే ఈ సినిమా షూటింగ్ ముగిసాక బాలయ్యకు మరో కథను వినిపించాడట పూరీ. అది పొలిటికల్ డ్రామా నేపథ్యంలో కొనసాగే కథ కావడంతో తప్పకుండా చేద్దామని బాలయ్య మాట ఇచ్చినట్లు సమాచారం. బాలయ్యకు నచ్చితే చేసిన దర్శకులతోనే మళ్లీ మళ్లీ చేయడం ఆయన అలవాటు. దీంతో పూరీతో బాలయ్య తప్పకుండా సినిమా చేస్తాడని చెబుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com