లంక పై భారత్ ఘనవిజయం..
- August 27, 2017
బాలగోళ్ల: భారత్-శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో 5 వన్డేల సిరీస్లో భారత్ మూడు నెగ్గడంతో సిరీస్ కైవసమైంది. ఓపెనర్ రోహిత్ శర్మ అజేయ శతకానికి మహేంద్రుడి అర్ధ శతకం తోడవ్వడంతో భారత్ విజయం సులువైంది.
లంక అభిమానుల ఆగ్రహాం...
44 ఓవర్లకు భారత్ 210 పరుగులు చేసి విజయానికి 8 పరుగుల దూరంలో ఉండగా.. భారత విజయాన్ని తట్టుకోలేని లంక అభిమానులు ఆగ్రహాంతో మైదానంలోని ఫీల్డర్లపై పెద్ద ఎత్తున బాటిళ్లు విసిరారు. దీంతో మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపేసిన అంపైర్లు.. కొద్దీ సేపటి అనంతరం మ్యాచ్ను పునప్రారంభించారు. మరో 7 బంతులు ఆడిన భారత్ లక్ష్యాన్ని చేదించింది.
అంతకు ముందు లంక నిర్దేశించిన 218 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా టపార్డర్ బ్యామ్స్ మెన్ తడబడటంతో రెండో వన్డే పరిస్థితి మరోసారి కనిపించింది. అయితే ఓపెనర్ రోహిత్ శర్మ(122 నాటౌట్), మహేంద్రసింగ్ ధోని(61 నాటౌట్)లు రాణించడంతో భారత్ సునాయసంగా గెలుపొందింది. ఇక భారత్ టాపార్డర్ బ్యాట్స్మెన్లలో ఓపెనర్ శిఖర్ ధావన్(5) ఆదిలోనే అవుటై తీవ్రంగా నిరాశపరచగా కెప్టెన్ కోహ్ల్లీ(3), లోకేష్ రాహుల్(17), కేదార్ జాదవ్(0)లు మరోసారి విఫలమయ్యారు. లంక బౌలర్లలో అఖిల ధనంజయకు 2 వికెట్లు దక్కగా, లసిత్ మలింగా, ఫెర్నాండోలకు చెరో వికెట్ దక్కింది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









