లంక పై భారత్ ఘనవిజయం..
- August 27, 2017బాలగోళ్ల: భారత్-శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో 5 వన్డేల సిరీస్లో భారత్ మూడు నెగ్గడంతో సిరీస్ కైవసమైంది. ఓపెనర్ రోహిత్ శర్మ అజేయ శతకానికి మహేంద్రుడి అర్ధ శతకం తోడవ్వడంతో భారత్ విజయం సులువైంది.
లంక అభిమానుల ఆగ్రహాం...
44 ఓవర్లకు భారత్ 210 పరుగులు చేసి విజయానికి 8 పరుగుల దూరంలో ఉండగా.. భారత విజయాన్ని తట్టుకోలేని లంక అభిమానులు ఆగ్రహాంతో మైదానంలోని ఫీల్డర్లపై పెద్ద ఎత్తున బాటిళ్లు విసిరారు. దీంతో మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపేసిన అంపైర్లు.. కొద్దీ సేపటి అనంతరం మ్యాచ్ను పునప్రారంభించారు. మరో 7 బంతులు ఆడిన భారత్ లక్ష్యాన్ని చేదించింది.
అంతకు ముందు లంక నిర్దేశించిన 218 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా టపార్డర్ బ్యామ్స్ మెన్ తడబడటంతో రెండో వన్డే పరిస్థితి మరోసారి కనిపించింది. అయితే ఓపెనర్ రోహిత్ శర్మ(122 నాటౌట్), మహేంద్రసింగ్ ధోని(61 నాటౌట్)లు రాణించడంతో భారత్ సునాయసంగా గెలుపొందింది. ఇక భారత్ టాపార్డర్ బ్యాట్స్మెన్లలో ఓపెనర్ శిఖర్ ధావన్(5) ఆదిలోనే అవుటై తీవ్రంగా నిరాశపరచగా కెప్టెన్ కోహ్ల్లీ(3), లోకేష్ రాహుల్(17), కేదార్ జాదవ్(0)లు మరోసారి విఫలమయ్యారు. లంక బౌలర్లలో అఖిల ధనంజయకు 2 వికెట్లు దక్కగా, లసిత్ మలింగా, ఫెర్నాండోలకు చెరో వికెట్ దక్కింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్