లంక పై భారత్ ఘనవిజయం..
- August 27, 2017
బాలగోళ్ల: భారత్-శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో 5 వన్డేల సిరీస్లో భారత్ మూడు నెగ్గడంతో సిరీస్ కైవసమైంది. ఓపెనర్ రోహిత్ శర్మ అజేయ శతకానికి మహేంద్రుడి అర్ధ శతకం తోడవ్వడంతో భారత్ విజయం సులువైంది.
లంక అభిమానుల ఆగ్రహాం...
44 ఓవర్లకు భారత్ 210 పరుగులు చేసి విజయానికి 8 పరుగుల దూరంలో ఉండగా.. భారత విజయాన్ని తట్టుకోలేని లంక అభిమానులు ఆగ్రహాంతో మైదానంలోని ఫీల్డర్లపై పెద్ద ఎత్తున బాటిళ్లు విసిరారు. దీంతో మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపేసిన అంపైర్లు.. కొద్దీ సేపటి అనంతరం మ్యాచ్ను పునప్రారంభించారు. మరో 7 బంతులు ఆడిన భారత్ లక్ష్యాన్ని చేదించింది.
అంతకు ముందు లంక నిర్దేశించిన 218 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా టపార్డర్ బ్యామ్స్ మెన్ తడబడటంతో రెండో వన్డే పరిస్థితి మరోసారి కనిపించింది. అయితే ఓపెనర్ రోహిత్ శర్మ(122 నాటౌట్), మహేంద్రసింగ్ ధోని(61 నాటౌట్)లు రాణించడంతో భారత్ సునాయసంగా గెలుపొందింది. ఇక భారత్ టాపార్డర్ బ్యాట్స్మెన్లలో ఓపెనర్ శిఖర్ ధావన్(5) ఆదిలోనే అవుటై తీవ్రంగా నిరాశపరచగా కెప్టెన్ కోహ్ల్లీ(3), లోకేష్ రాహుల్(17), కేదార్ జాదవ్(0)లు మరోసారి విఫలమయ్యారు. లంక బౌలర్లలో అఖిల ధనంజయకు 2 వికెట్లు దక్కగా, లసిత్ మలింగా, ఫెర్నాండోలకు చెరో వికెట్ దక్కింది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







