ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం కిమ్ దేశ సరిహద్దులో బాంబుల వర్షం
- August 29, 2017
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మంగళవారం చేసిన క్షిపణి ప్రయోగం అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలను ఆందోళనల్లోకి నెట్టేసింది. జపాన్ ద్వీపమైన హోక్కాయ్ మీదుగా ప్రయాణించిన క్షిపణి పసిఫిక్ సముద్ర జలాల్లో మూడు భాగాలుగా విడిపోయి పడింది. అయితే, ఈ క్షిపణి ప్రయోగం గురించి దక్షిణ కొరియా ఇంటిలిజెన్స్కు ముందే సమాచారం ఉంది. దీంతో ఆ దేశం ముందు జాగ్రత్త చర్యగా.. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సరిహద్దులో బాంబుల వర్షం కురిపించింది.
సరిహద్దులో బాంబుల వర్షం
మరోవైపు ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉన్న సరిహద్దులో బాంబుల వర్షం కురిపించి తమ శక్తి సామర్ధ్యాలను కిమ్ కి తెలియచేయాలని దక్షిణ కొరియా భావించింది. సరిహద్దులో ఎనిమిది బాంబులను వేసే ప్రక్రియకు అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఆదేశాల మేరకే జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎఫ్15 కే ఫైటర్ జెట్ల ద్వారా ఎనిమిది మార్క్ 84 బాంబులను సరిహద్దులో వేస్తామని దక్షిణి కొరియా తెలిపింది.
వణికిపోయిన జపాన్
మంగళవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఉత్తర కొరియా చేసిన ప్రయోగానికి జపాన్ వణికిపోయింది. దేశం మీదకు క్షిపణి వస్తోందని ప్రజలంతా ఇళ్లలోకి వెళ్లిపోవాలని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన వారిని తీవ్ర భయాందోళనలకు గురి చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







