కుండపోత వర్షాలతో ముంబై

- August 29, 2017 , by Maagulf
కుండపోత వర్షాలతో ముంబై

ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలతో ముంబైలో చాలా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. జోగేశ్వరి, మాతుంగా వైపు వెళ్లే రైళ్లు ఆగిపోవడంతో పాటూ  బాంద్రా, చర్చ్ గేట్, వెళ్లే రైలు మార్గాలపై నీళ్లు భారీగా నిలిచిపోయాయి.  భారీ వర్షంతో రోడ్లపై, లోతట్టు ప్రాంతాల్లో బస్తీల్లో భారీగా నీళ్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. మొదటే అతంతమాత్రంగా ఉన్న రోడ్లు వర్షంతో వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. సియాన్, దాదర్, ముంబై సెంట్రల్, కుర్లా, అంధేరీ, సాకినాక ప్రాంతాలను కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. మరో 24 గంటలపాటు ముంబైలో వర్షాలు పడుతాయని అధికారులు హెచ్చరించారు. గత 24 గంటలుగా శాంతాక్రజ్ అబ్జర్వేటరీ దగ్గర 88 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. పశ్చిమ తీరంలో కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com