కుండపోత వర్షాలతో ముంబై
- August 29, 2017
ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలతో ముంబైలో చాలా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. జోగేశ్వరి, మాతుంగా వైపు వెళ్లే రైళ్లు ఆగిపోవడంతో పాటూ బాంద్రా, చర్చ్ గేట్, వెళ్లే రైలు మార్గాలపై నీళ్లు భారీగా నిలిచిపోయాయి. భారీ వర్షంతో రోడ్లపై, లోతట్టు ప్రాంతాల్లో బస్తీల్లో భారీగా నీళ్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. మొదటే అతంతమాత్రంగా ఉన్న రోడ్లు వర్షంతో వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. సియాన్, దాదర్, ముంబై సెంట్రల్, కుర్లా, అంధేరీ, సాకినాక ప్రాంతాలను కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. మరో 24 గంటలపాటు ముంబైలో వర్షాలు పడుతాయని అధికారులు హెచ్చరించారు. గత 24 గంటలుగా శాంతాక్రజ్ అబ్జర్వేటరీ దగ్గర 88 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. పశ్చిమ తీరంలో కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







