కార్మికులకు సహాయంగా వేసవి స్వచ్ఛంద కార్యక్రమం
- August 30, 2017
వేసవి ఉష్ణోగ్రతలు గత నెలరోజుల నుంచి పతాక స్థాయికి చేరుకొన్నాయి. తక్కువ ఆదాయం గల కార్మికుల అవస్థలను దృష్టిలో ఉంచుకొని బహ్రెయిన్ మలయాళీ బిజినెస్ ఫోరమ్ యువజన విభాగం సభ్యులు నిర్వహించిన వేసవి దాతృత్వ కార్యక్రమంలో భాగంగా పలువురు కార్మికులకు నీటి బాటిళ్లను , పండ్ల రసాన్ని, ఆహారాన్ని పంపిణీ చేస్తూ సాటి మనిషిపై సానుభూతిని ప్రదర్శిస్తున్నారు. 'హెల్ప్ అండ్ డ్రింక్ 2017' పేరిట 35 మంది కార్యకర్తలచే ఈ సేవా కార్యక్రమంను ఎంతో క్రమశిక్షణతో అమలుచేస్తున్నారు. వీరిలో అత్యధికులు యువకులు, వీరి ఆధ్వర్యంలో ఇప్పటికే 14000 తాగునీటి సీసాలను పంపిణీ చేశారు. ప్రస్తుత వేసవికాలంలో చాలా మంది శ్రామికులు ఎర్రని ఎండలలో పని చేస్తున్నారు. ఈ వేడి వాతావరణంలో వారికి నీరు లేదా ఆహారం లభిస్తే అది వారికి గొప్ప ఉపశమనం ఉంటుందని బహ్రెయిన్ మలయాళీ బిజినెస్ ఫోరమ్ వ్యవస్థాపకుడు, కార్యదర్శి బషీర్ అమ్బలాయి " మా గల్ఫ్ డాట్ కామ్ " తో చెప్పారు. ఈ వితరణను వీధి క్లీనర్లు, రహదారి నిర్వహణ కార్మికులు, నిర్మాణ కార్మికులు మరియు అవసరమైన ఇతర కార్మికులకు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. . ఉదయం 5 గంటల నుండి పంపిణీ ప్రారంభమవుతుందని అలాగే ఉదయం 8 గంటల వరకు కొనసాగుతుంది. అదేవిధంగా శుక్రవారాలు పంపిణీ ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ పంపిణీ విజయవంతం కావడానికి , మా స్పాన్సర్ల మద్దతు ప్రధాన కారణమని వారు మాకు తగినంత నీరు మరియు ఆహారంయొక్క ప్యాకెట్లను మాకు సహాయం చేయడం ద్వారా వితరణ సాధ్యమవుతుందని వివరిస్తూ ఈ కార్యక్రమం సెప్టెంబరు 8 వ తేదీన ముగిస్తుందని బషీర్ అమ్బలాయి తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







