ఈ ఏడాది మక్కా యాత్రకు మరింత సంఖ్యలో కతర్ యాత్రికులు : ఖలేద్ అల్-ఫైసల్
- August 31, 2017
మాట్లాడుతూ మక్కా యాత్ర కోసం వచ్చిన యాత్రికుల సంఖ్య 1,752,014, ఉందని గత సంవత్సరంతో పోలిస్తే 426,263 అత్యధికులు హాజరైనట్లు మక్కా ప్రాంత ఎమిర్, రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడికి మరియు సెంట్రల్ హజ్ కమిటీ చైర్మన్ ప్రిన్స్ ఖలేద్ అల్-ఫైసల్ పేర్కొన్నారు.సౌదీ ప్రెస్ ఏజెన్సీతో బుధవారం ఆయనతో మాట్లాడుతూ గత ఏడాది ఖతారి యాత్రికులు 1,210 మంది మక్కా యాత్రకు వచ్చేరని ఈ సంవత్సరం 1,564 మంది ఖతారి యాత్రికులు చేరుకున్నారని ఆయన చెప్పారు. యాత్రికులకు సౌకర్యాలు ఏవిధంగా అమరుతున్నాయో పరిశీలించేందుకు ప్రిన్స్ ఖలేద్ అల్-ఫైసల్ బుధవారం ముందుగా మినాకు వచ్చారు. ఈ సంవత్సరం యాత్రికుల భద్రత, మరియు వారి ఆధ్యాత్మిక ప్రయాణం కోసం 300,000 మంది పౌర మరియు సైనిక సిబ్బందిని నియమించినట్లు ఆయన ప్రకటించారు. మినాలో మక్కా గవర్నరేట్ ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అతిథులకు ఉత్తమమైన సేవలను అందించడానికి అల్లాహ్ యొక్క కరుణ సంరక్షణ మరియు నిరంతర సూచనలతో కొనసాగుతున్నట్లు ఆయున తెలిపారు. హజ్ కు సంబంధించిన అన్ని విషయాల్లో తన నిర్దేశితాల కోసం డిప్యూటీ ప్రీమియర్ మరియు రక్షణ శాఖ సహాయ మంత్రి క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ కు రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు రాజు సల్మాన్ ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







