ఇరాన్లో ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది బాలికల మృతి
- September 01, 2017
ఇరాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో11 మంది బాలికలు సహా 12 మంది మృత్యువాతపడ్డారు. ఇరాన్లోని షిరాజ్ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. షిరాజ్లో జరిగే క్రీడా, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి 45 మంది విద్యార్థినులు బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది అమ్మాయిలతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన బాలికలను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
కాగా ఇరాన్లో రహదారులు బాగున్నప్పటికీ.. ట్రాఫిక్ భద్రత విషయంలో పేలవమైన రికార్డు ఉంది. డ్రైవర్ల నిర్లక్ష్య కారణంగా ప్రతి ఏడాది వేలాదిమంది ప్రమాదానికి గురవుతున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







